Saturday, April 27, 2024

WGL: రోడ్డుప్రమాదంలో… ఒకరు మృతి, ఇద్దరు మహిళలకు గాయాలు

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామ శివారు రైతు వేదిక సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని మంగళ వారి పేట గ్రామానికి చెందిన ఆబోతు సాంబరాజు (35) అను వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వివరాల ప్రకారం… మంగళ వారి పేట గ్రామానికి చెందిన ఆబోతు సాంబరాజు నర్సంపేట పట్టణ శివారులోని ఎంజేఆర్ రైస్ మిల్లులో హామాలిగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. రోజులాగే ఇవాళ ఉదయం పనిచేసేందుకు మిల్లుకు టీఎస్ 03 ఈ సి 4073 మోటార్ సైకిల్ పై బయలుదేరగా.. గ్రామ శివారులో మరో ఇద్దరు మహిళలు లిఫ్ట్ అడగడంతో వారిని ఉదరావుపేట బస్టాండ్ వద్ద దింపేందుకు బయలుదేరాడు.

ఈ క్రమంలో రైతు వేదిక సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనం రోడ్డు చివరి వైపు వరకు వెళ్లి బండరాయని ఎక్కడంతో అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లగా.. అక్కడే ఆగి ఉన్న వాటర్ ట్యాంక్ ను ఢీ కొట్టింది. దీంతో కింద పడిపోయిన సాంబరాజు అక్కడికక్కడే మృతి చెందారు. అదే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొడుతి మాటు తండాకు చెందిన భూక్య యాదమ్మ, భూక్య భద్రమ్మలకు గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement