Thursday, April 25, 2024

TS: జనగామ ఏసీపీపై.. ఎన్నికల కమిషన్ వేటు

జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జనగామ ఏసీపీ మీద వేటు పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జనగామ జిల్లా ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది.

నిబంధనల మేరకు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఏసీపీ ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement