Friday, April 19, 2024

Nzb | నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్: స్పీకర్ పోచారం

నిజామాబాద్ (ప్రభ న్యూస్): నాకు రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి తారక రామారావేనని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా వర్ని మండల కేంద్రంలో ఇవ్వాల (శనివారం) రాత్రి ఎన్టీఆర్ కాంస్య‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కు నేను పెద్ద అభిమానిని అని, చిన్నతనంలో ఎన్టీఆర్ ప్రతి సినిమను చూసేవాడిన‌న్నారు. ఆనాడు ఎన్టీ రామారావు త‌న‌కు అవ‌కాశం ఇవ్వకపోతే రాజకీయంగా ఈ స్థాయిలో ఉండేవాన్ని కాదన్నారు. రాష్ట్రంలో సగం మంది టిడిపి నుండి వచ్చిన వాళ్ళమేనని, దేశంలో సంక్షేమానికి నాంది పలికిన ఏకైక మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని పోచారం పేర్కొన్నరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement