Friday, May 3, 2024

రోడ్డుపై వ‌ర్ష‌పు నీరు.. నాటువేసి నిర‌స‌న తెలిపిన యువ‌కులు

దోమకొండ మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ముత్యంపేట గ్రామంలో పరువు కాలనీలో నీరు వెళ్లడం లేదు. దాంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ విషయాన్ని సర్పంచ్ కు పంచాయతీ పాలకవర్గానికి చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆ కాలనీలో చదువుకున్న‌ కొంతమంది యువకులు రోడ్డుపై నిలిచిన నీటిలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మహేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అంజిరెడ్డి, ముత్తి బుచ్చిరాజు, వంగ తిరుపతి, వంగ తిరుపతి కొడిపాక ప్రసాద్, మల్లేశం, దేవరాజ్ తో పాటు పలువురు గ్రామ ప్రజలు బురదలో నాటు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement