Monday, April 29, 2024

TS : ప్రారంభ‌మైన మున్సిప‌ల్ బ‌డ్జెట్ స‌మావేశం… బిజెపి కార్పొరేటర్ల నిరసన..

నిజామాబాద్‌ప్ర‌తినిధి, ఫిబ్ర‌వ‌రి 22(ప్ర‌భ‌న్యూస్‌): మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో మీడియాని అనుమతించాలని బిజెపి కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. గురువారం నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొ రేషన్ నూతన భవనంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ అధ్యక్షతన మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ బడ్జెట్ సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, అర్బన్ ఎమ్మె ల్యే ధన్‌పా ల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లు హాజరయ్యారు.

మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించే బడ్జెట్ సమావే శానికి మీడియాని లోపలికి అనుమతించకుండానే బడ్జెట్ సమావేశం ఎలా కొనసాగి స్తారనీ బిజెపి కార్పొరేటర్లు ప్రశ్నించారు. గత బిఆర్ఎస్ 10 సంవత్సరాల హయంలో ఒక్క సారైనా కార్పొరేషన్ బడ్జెట్ సమావేశానికి మీడియాని అనుమతించలేదు. తూతూ మంత్రంగా కౌన్సిల్, బడ్జెట్ సమావేశాన్ని కొనసాగారే తప్ప ఏమీ లేదు. మీడియా సమక్షం లోని బడ్జెట్ సమావేశం నిర్వహించాలని మెజార్టీ సభ్యులు డిమాండ్ చేశారు నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం ప్రారంభం లోనే రసాభాసగా సాగింది.

- Advertisement -

ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే మీడియాని అనుమతిం చడంలో అంతర్యం ఏమిటి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. అసెంబ్లీ ,చట్టసభల్లో కూడా మీడి యాని అనుమతిస్తారు బడ్జెట్ సమావేశంలో అనుమ తిస్తే ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement