Sunday, April 28, 2024

NZB: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మానాల…

నిజామాబాద్, మార్చి 22(ప్రభ న్యూస్) : రాష్ట్ర కోపరటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించినందుకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రాష్ట్ర ఇంఛార్జి దీప్ దాస్ మున్షీని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మానాల మోహన్ రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లో రాష్ట్ర కోపర టివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పజెప్పినందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, నిఖిల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement