Monday, May 6, 2024

నిజామాబాద్ జిల్లాలో చిన్నారి కిడ్నాప్ కలకలం..

నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. బోధన్‎లో ఎనిమిది నెలల చిన్నారిని ఇద్దరు మహిళలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. చిన్నారి తల్లి లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కిడ్నాప్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు రూ.30వేలకు విక్రయించినట్లు గుర్తించారు. అనంతరం చిన్నారిని క్షేమంగా తల్లికి అప్పగించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement