Monday, May 6, 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ : ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

భిక్కనూర్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదివారం బస్వాపూర్ గ్రామం లో రూ.25 లక్షలతో నిర్మించిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు. పలు రకాల ఉద్యోగాలు సాధించేందుకు నిరుద్యోగులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గ్రంథాలయాలు వరం లాంటివ‌ని చెప్పారు. ఉద్యోగులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, జిల్లా తెరాస అధ్యక్షులు మూజీబ్ ఎంపీపీ గాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మంజుల మల్లారెడ్డి, తదితరులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement