Wednesday, May 1, 2024

అక్రమ సంబంధం.. భర్తను హత్య చేసి.. ఇంట్లోనే పాతిపెట్టిన భార్య, ప్రియుడు

ఎల్లారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో అక్రమ సంబంధంతో భర్తను హత్యచేసి భార్య, ప్రియుడు పాతిపెట్టిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇంట్లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న రమేష్ (26) ను హత్యచేసి పాతిపెట్టిన భార్య వెన్నెల(25), ప్రియుడు దస్తప్ప (26) వికారాబాద్ వాసిగా గుర్తించారు.

ఎనిమిది రోజుల క్రితం భర్తను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన భార్య, ప్రియుడు పోలీసుల విచారణతో తప్పును ఒప్పుకున్నారు. మృతుని స్వస్థలం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా, సీదం తాలూక, వి బొందెం పల్లికి చెందిన వారుగా గుర్తించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement