Sunday, April 28, 2024

NZB: టియూడబ్ల్యూజే రాష్ట్ర అద్యక్షుడిని కలిసిన జిల్లా నాయకులు

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 30(ప్రభ న్యూస్)
టియూడబ్ల్యూజే రాష్ట్ర అద్యక్షుడిగా ఏకగ్రీ వంగా ఎన్నికైన విరహత్ అలీ ని యూనియన్ జిల్లా అధ్య క్షులు ఎడ్ల సంజీవ్, జిల్లా కార్యదర్శి తీగల అరవింద్, బాలాజీలు మర్యాద పూర్వ కంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ యూనియన్ కార్యా లయంలో టియూ డబ్ల్యూజే (ఐజే యూ)రాష్ట్ర అద్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విరహత్ అలీని యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, జిల్లా కార్యదర్శి తీగల అరవింద్ బాలాజి, జాతీయ కౌన్సిల్ సభ్యులు చింతల గంగాదాస్, జిల్లా పూర్వాద్యక్షులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య కలిశారు.

ఈ సందర్భంగా జిల్లాలోని యూనియన్ పరిస్థితులపై ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో, కొత్తగా ఎంపిక అయిన రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీతో చర్చించారు. అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్ అభివృద్ది కోసం మరింత కృషి చేయాలని సూచించారు. యూనియన్ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేసే వారిపై జిల్లా కమిటీలో చర్చించి చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ సంద్భంగా రాష్ట్ర అధ్యక్షుడుగా ఏక గ్రివంగా ఎన్నిక అయిన విరహత్ అలీ ని సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement