Wednesday, May 15, 2024

కామారెడ్డిలో సైక్లింగ్ ర్యాలీ

కామారెడ్డి : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా సైక్లింగ్ ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ ర్యాలీ సత్య గార్డెన్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా ఇందిరాగాంధీ స్టేడియం వరకు చేపట్టారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గంగపుత్ర ఎంప్లాయిస్ అసోసియేషన్ సహకారంతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్, ఫోర్ గ్రామ్ అధికారులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శిరీష, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు రాజన్న, ప్రధాన కార్యదర్శి రవికుమార్, సైక్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement