Wednesday, May 1, 2024

TS | బిక్కనూర్ టోల్​గేట్​ వద్ద కంటైనర్ బీభత్సం.. అదుపుతప్పి టోల్​బూత్​ని ఢీకొట్టి..

బిక్కనూర్ (ప్రభ న్యూస్) : నిజామాబాద్​ జిల్లా బిక్కనూరులో కంటైనర్​ బీభత్స సృష్టించింది.44వ జాతీయ రహదారిపై గల టోల్ గేట్​ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. హైదరాబాద్​ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ అతివేగంగా వచ్చి టోల్​గేట్ వద్ద ఉన్న డివైడర్​ని ఢీ కొట్టింది. దీంతో కంటైనర్​ బోల్తా పడింది. ఆ సమయంలో టోల్ బూతులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

కంటైనర్​ వాహనం టోల్​ బూత్​ని ఢీకొట్టడంతో ఒక టోల్​బూత్​ పూర్తిగా ధ్వంసం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఒకవైపు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. టోల్గేట్ వద్దకు జేసీబీ తెప్పించి బొల్తాపడిన వాహనాన్ని తొలగించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement