Monday, May 6, 2024

మహిళలే భారతీయ కుటుంబ వ్యవస్థకు మూలాలు – కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల

మాచారెడ్డి (కామారెడ్డి) ప్రభన్యూస్ ఏప్రిల్27 జహీరాబాద్ పార్లమెంటు ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి నియోజక వర్గ పర్యటనలో భాగంగా కేంద్ర మత్స్య, పశు సంవర్థక, డైరీ మంత్రివర్యులు పరుషోత్తం రూపాల లక్ష్మి దేవి గార్డెన్స్ లో మహిళా సంఘాల (డ్వాక్రా) సభ్యులతో సమావేశలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా రూపాల మాట్లాడుతూ మహిళలే భారతీయ కుటుంబ వ్యవస్థ మూలాలనీ, వారు కుటుంభం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని అన్నారు. గతంలో మోది సర్కారు రాక ముందు మహిళలు పడుతున్న ఇబ్బందులు చూసి మహిళల సాధికారత కోసమే మోది స్వచ్చ భారత్ ద్వారా ఇంటింటికి మరుగు దొడ్ల నిర్మించారనీ అన్నారు.

ప్రతి బూత్ లో సగానికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. అకాల వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం కలిగిందని రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం గురించి కేంద్రానికి నివేదిక ఇస్తానని అన్నారు .తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం ప్రతి కార్యకర్త రాబోయే ఎన్నికల వరకు పార్టీ కోసం కష్టపడి పని చేయాలని అన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే గెలుపు సులభతరం అవుతుందని అన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అరుణతార.కామారెడ్డి ఇన్చార్జ్ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి.మురళీధర్ గౌడ్. నాయకులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement