Sunday, April 28, 2024

NZB: ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక పార్టీ బీజేపీ.. ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, నవంబర్ 25 (ప్రభ న్యూస్) : ఇచ్చిన మాట… నిలబెట్టుకునే ఏకైక పార్టీ బీజేపీ అని ఆ పార్టీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. కేంద్రంలో అనేక పథకాలు మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ఇవాళ నగరంలోని 22వ డివిజన్ లోని మహాలక్ష్మి నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… కేసీఆర్ మాయ మాటలు నమ్మి యువత మోసపోయిందన్నారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసిందన్నారు.

నిరుద్యోగ యువకులకు రూ.3,016 అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసపూరిత హామీలో మభ్యపెట్టారన్నారు. ఒక్కసారి బీజేపీకి ఓటెయ్యండని ప్రజలను అభ్యర్థించారు. రామ మందిర నిర్మాణం, త్రిబుల్ తలాక్, జన్ ధన్ ఖాతా, ఆయుష్మాన్ భారత్ ఇలా ప్రవేశ పెట్టి పేదలను ఆదుకున్నది బీజేపీ అన్నారు. ఒక్కసారి ఇందూరు నగరంలో బీజేపీకి కూడా భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పంచారెడ్డి లావణ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్, కన్వీనర్ పంచరెడ్డి లింగం ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, కుమార్, శివ ప్రసాద్, శేఖర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement