Wednesday, May 1, 2024

TS: ఎమ్మెల్యేగా బాజిరెడ్డిని గెలిపించాలి… రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి

నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 26 (ప్రభ న్యూస్) : రూరల్ ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని గెలిపించాలని రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి కోరారు. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గ బీఆర్ ఎస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం గురువారం బోర్గ పి మొట్టాడి రెడ్డి కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా రెడ్డిల నుద్దేశించి సురేష్ రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో త్యాగం చేసి అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారని, తెలంగాణ కోసం ఎనలేని సేవలందిస్తున్న వ్యక్తి ఆయనేనని, రాబోయే ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్దన్ ను గెలిపించాలన్నారు.

ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్నా.. కూడా అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి బాజిరెడ్డి అన్నారు. తెలంగాణ ఇస్తే కరెంటు ఉండదు.. రైతులు కష్టాల పాలవుతారని ఎంతో మంది అనుకున్నా.. తెలంగాణ సాధించుకున్న కేసీఆర్ 24 గంటల విద్యుత్తు, రైతులకు రుణమాఫీ, షాదీ ముభారక్ లాంటి అనేక పథకాలు ప్రవేశ పెట్టారని, అభివృద్ధిని చూసే బాజిరెడ్డికి మళ్ళీ పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక్కసారి బీఆర్ఎస్ మేనిఫెస్టో చూడండన్నారు. అనంతరం గోదావరి గట్టుంది పాట పై వివరించారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రూరల్ నియోజక వర్గ ఎన్నికల ఇంఛార్జి వీజీ గౌడ్, నుడ చైర్మెన్ సంజీవ్ రెడ్డి, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తో పాటు వివిధ మండలాల ఎంపీపీ లు, జడ్పీటీసీలు లు మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement