Friday, May 3, 2024

కవిత ఇంటిపై దాడి హేయమైన చర్య : మంత్రి తలసాని

బీజేపీ నేతలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై దాడికి దిగడం హేయ‌మైన చ‌ర్య అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌, కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌తో కలిసి మంత్రి మంగళవారం ఎంపీ కవితను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరుగుతున్న సమయంలో బీజేపీ నేతలు కవిత ఇంటిపైకి రావడం దుర్మార్గమని, హేయమైన చర్యని మండిపడ్డారు. బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రావడం సిగ్గుచేటన్నారు. మీ ఇండ్ల‌ మీదికి రావాలంటే పెద్ద విషయం కాదని, మా టీఆర్‌ఎస్‌ సైన్యం ఎంతో తెలుసా? అన్న ఆయన.. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement