Sunday, April 28, 2024

Nizamabad – యూనియన్ అభివృద్దే మాధ్యేయం..

నిజామాబాద్ సిటీ ,డిసెంబర్ (ప్రభ న్యూస్)24: సహారా రియల్ ఎస్టేట్ నిజా మాబాద్ యూనియన్ సంక్షే మమే ధ్యేయంగా కృషి చేస్తా మని నూతన కార్యవర్గం తెలి పారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సహారా రియల్ ఎస్టేట్ యూనియన్ నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. హోరాహోరీగా నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షులుగా సయ్యద్ ఖాజా మోహినుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా ఎండి షఫీఉద్దీన్, అధ్యక్షులు పి.అలీమ్ విజయం సాధించారు. సుమారు 1075 మంది యూనియన్ లో సభ్యత్వం కలిగి ఉన్నారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ.. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ యూనియన్ బలోపేతానికి కృషి చేస్తామ న్నారు. మాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు యూనియన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవీకాలం రెండున్నర సంవత్సరాల కొనసాగుతుందన్నారు. అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గాన్ని యూనియన్ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సహారా రియల్ ఎస్టేట్ యూనియన్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement