Thursday, May 2, 2024

Nizamabad – తనిఖీల్లో రూ .11 లక్షల 56 వేల నగదు స్వాధీనం

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ (ప్రభ న్యూస్)30:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీల్లో రూ .11లక్షల 56 వేల నగదు ను స్వాధీన పరుచుకున్నట్లు టౌన్ సిఐ నరహరి తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వ ర్ సింగనవార్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ జయరాం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ నరహరి, రెండవ పట్టణ ఎస్ఐ అశోక్, తన సిబ్బందితో కలిసి శివాజీ నగర్ లో వాహన తనిఖీలు నిర్వహించారు.

ఓ ద్విచక్ర వాహనంపై షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి వద్ద బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. అ బ్యాగులో 11 లక్షల 56 వేల 480 రూపాయల నగదును గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. డబ్బుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పంచుల సమక్షంలో ఐటీ డిపార్ట్మెంట్ వారికి అప్పగించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement