Saturday, May 11, 2024

Nirmal : కవయిత్రి మొల్ల, కవి మడిపల్లి భద్రయ్య విగ్రహాలకు.. మంత్రి నివాళులు

నిర్మల్ .. ప్రభా న్యూస్ : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ సాహిత్య దినోత్సవం కవి సమ్మేళనం సందర్భంగా రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కేంద్రంలోని కవయిత్రి మొల్ల, కవి మడిపల్లి భద్రయ్య ల విగ్రహాలకు పూలమాల‌ వేసి నివాళులర్పించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులకు పెద్దపీట వేస్తుందనిపేర్కొన్నారు.వారికి సమాజంలో మంచి గుర్తింపు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్,ఎంపిపి కోరిపెల్లి రామేశ్వర్ రెడ్డి,జిల్లా విద్యాశాధికారి గార్లు ,కవులు,తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement