Wednesday, May 1, 2024

నేపాల్ యువ‌కుడికి విద్యుత్ షాక్ – పరిస్థితి విష‌మం..

చేవెళ్ల,జూలై 23(ప్రభన్యూస్): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న హై ఓల్టేజ్ విద్యుత్ స్తంభంపై నేపాల్ కు చెందిన అనిల్ (21) విద్యుత్ షాక్ తగిలి స్తంభంపైనే వ్రేలాడుతూ ఉన్నాడు. షాక్ తగిలింది వేలాడుతున్న ఆ యువకుని జనాలంతా చూస్తూ ఉండిపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీస్ లు పక్కనే ఉన్న జేసీబి సహాయంతో స్తంబానికి వ్రేలాడుతున్న యువకున్ని కిందికి దించారు.

షాక్ తగిలిన యువకుడు చేవెళ్ల లోని శ్రీ వెంకటేశ్వర సినిమా థియేటర్ యజమాని దామోదర్ వద్ద ఇంటర్నెట్ విభాగంలో పనిచేస్తాడు. విషయం తెలుసుకున్న దామోదర్ ఘటన స్థలానికి చేరుకొని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అనిల్ కు ప్రథమ చికిత్స నిర్వహించారు. నెట్ కేబుల్ వైర్ల కనెక్షన్ ఇస్తున్న క్రమంలో వైరు ఐవోల్టేజ్ వైర్లకు తగిలి ఈ ప్రమాదం జరిగింది. షాక్ వల్ల తీవ్రంగా గాయపడ‌టంతో అతని పరిస్థితి ఆరోగ్య విష‌మించింది. దీంతో మెరిగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement