Sunday, April 28, 2024

Medak వీరభద్రస్వామి సేవలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

అంగడిపేట లో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

*సాధారంగా ఆహ్వానించిన ఆలయ కమిటీ

* పండితుల వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు

సంగారెడ్డి మండలం అంగడిపేట గ్రామంలోని వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సందర్శించారు. వీరభద్ర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు నీలం మధు ముదిరాజ్ విచ్చేశారు.

- Advertisement -

ఆలయ ఇన్చార్జి చోట్ల శ్రీనివాస్, కమిటీ సభ్యులు మధును సాదరంగా ఆహ్వానించి, వేద మంత్రోచరణలతో ప్రత్యేక పూజలు చేయించారు. స్వామివారి అనుగ్రహం తనపై ఉండాలని పండితులను అభ్యర్థి నీలం మధు ఈ సందర్భంగా ప్రార్థించారు.

అనంతరం ఆలయ ఇన్చార్జి శ్రీనివాస్, కమిటీ సభ్యులతో పాటు ఎంపీపీ లావణ్య, తనయుడు సాయి, చాపల విశ్వనాథం, గుమ్మడిదల జగన్ తదితరులు నీలం మధును శాలువాలతో ఘనంగా సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement