Friday, May 3, 2024

TS: కరెంట్ మూడు గంటలు కావాలా..? 24 గంటలు కావాలా రైతులే తేల్చుకోవాలి.. కేసీఆర్

నిర్మల్ ప్రతినిధి, నవంబర్ 2 (ప్రభ న్యూస్) : మూడు గంటల కరెంట్ కావాలో..? 24గంటల కరెంట్ కావాలో రైతులే తేల్చుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో ప్రజా స్వామ్య పరిణితి రావాల్సిన స్థాయిలో రాలేదు. ఏ దేశాల్లో వచ్చిందో అవి మనకంటే ముందుకు వెళ్లిపోతున్నాయి. అభివృద్ధి కొనసాగుతుందన్నారు. గ్రామాల్లో తాను చెప్పిన మాటలు చర్చ పెట్టాలన్నారు.
30న ఓట్లు పడుతాయి. 3న లెక్కిస్తారు. ఎవరో ఒకరు గెలుస్తారు.. వజ్రాయుధం మీ ఓటు. మీ నిర్ణయాధికారంలో ఉండే ఓటు గొప్పదన్నారు.


ఏ ప్రభుత్వం ఏర్పడితే లాభం, ఏ పార్టీ గెలిస్తే లాభం అనే దానిపై చర్చ జరగాలన్నారు. ఎన్నికలు కాగానే ఆగమై గతంలో మంచి చేసిన పార్టీని మరువొద్దన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలిస్తే మీకు లాభం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం.. వారి హక్కులు కాపాడటం కోసం
తెలంగాణకు కాపలదారే బీఆర్ఎస్, చావునోట్లో తలకాయ బెట్టి తెలంగాణ సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం కాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా ? నిర్మల్ కు జిల్లా తెచ్చిన వ్యక్తి ఇంద్రకిరణ్ రెడ్డి
ఆదిలాబాద్ ను నాలుగు జిల్లాలు చేయాలని చెప్పిన వ్యక్తి ఇంద్రకిరణ్ రెడ్డి.. అవే మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ అన్నారు. నాలుగు జిల్లాల్లో నాలుగు మెడికల్ కాలేజీలు పెట్టించినం..
ఇంద్రకిరణ్ రెడ్డి పుట్టిన ప్రాంతం నిర్మల్ కాబట్టి ప్రేమ ఉందన్నారు. సభతో ఇంద్రకిరణ్ రెడ్డి గెలిచిపోయిండని సభను చూస్తే తెలిసిపోతుందన్నారు.


70 నుండి 80 వేల మెజారిటీతో గెలిపించండి.. ఇంజనీరింగ్ కాలేజి చేపించే బాధ్యత తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కర్ఫ్యూలేదు. మత కల్లోహాలు లేవన్నారు. ఇటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులపై కత్తులతో దాడులు చేస్తున్నారన్నారు. దుర్మార్గమైన సంస్కృతి తయారు చేస్తున్నారన్నారు. దళిత సమాజం అణిచివేయబడిందన్నారు. అంటరానితనం అనే వివక్షకు గురైందన్నారు. నెహ్రూగారి నుంచే వీరి సంక్షేమం పెట్టి ఉంటే దళితుల పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. దళితబంధు అనే స్కీం పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ అన్నారు. దళిత సమాజాన్ని ఉద్దరించాలన్నదే మా లక్ష్యమన్నారు. పోడు పట్టాలు గిరిజనులకు ఇవ్వడంతో పాటు రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నామన్నారు. రైతుబంధు అనే పదం పుట్టిందే కేసీఆర్ నోటి నుంచి, కరెంటును బాగా చేసినం.. నిర్మల్ నియోజకవర్గంలో 15 సబ్ స్టేషన్లు కట్టుకున్నామన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

- Advertisement -

నీళ్లు ఉచితమే, కరెంటు ఉచితమే.. పండిన పంటను ప్రభుత్వమే కొంటూ ఉన్నదన్నారు. రుణమాఫీ చేసుకున్నామన్నారు. అంజుమాన్ అప్పులు బాకీ ఉంటే రైతుల ఇండ్ల తలుపులు గుంజుకుపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల పన్నును దుబారా చేస్తూ రైతుబంధు ఇస్తున్నడని చెబుతున్నాడన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ .. కరెంటు 24 గంటలు వేస్ట్ గా ఇస్తున్నాడని అన్నాడు. 3 గంటలు ఇస్తే చాలు అంటున్నాడు. ధరణి పోర్టల్ తెచ్చినం.. ఇది వద్దు అని కాంగ్రెస్ అంటుందన్నారు.
లంబాడ హక్కుల పోరాట సమితి మావనాటే మావరాజ్ అంటూ మాట్లాడేవారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినం. పోడు పట్టాలు 4 లక్షల ఎకరాలు ఇచ్చాం. త్రీఫేజ్ కరెంటు కూడా ఇస్తున్నాం. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే వాళ్లకు రైతుబంధు మీద ఇష్టం లేదు. 24 గంటలు కరెంటు ఇవ్వడం కాంగ్రెస్ కు ఇష్టం లేదన్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి ముందుకు వెళ్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్మల్, ముథోల్, ఆదిలాబాద్ వచ్చాను. భగవంతుడి దయ ఉంటే తెలంగాణ పక్కా వస్తుందని ఆనాడు చెప్పాను. వచ్చిందన్నారు. కులమతాలకు అతీతంగా అందరినీ తమతో తీసుకువెళ్తున్నామన్నారు. అందరి ముఖాల్లో నవ్వు చూడాలి. రెసిడెన్షియల్ పాఠశాలల్లోముస్లీంలకు విద్య అందిస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రాణంతో ఉన్నంత వరకు శాంతిభద్రతలు ఉంటాయన్నారు.


ఎన్నికల తర్వాత నిర్మల్ నియోజకవర్గానికి లిఫ్టు ఇస్తామన్నారు. కొత్త మేనిఫెస్టో మీ ముందుంది.. బాగుందన్నారు. త్వరలో 4 కోట్ల ధాన్యం పండించి పంజాబ్ ను దాటిపోతుందన్నారు. విధి వంచితులను ఆదుకునే బాధ్యత సమాజం మీద, ప్రభుత్వం మీద ఉంటుందని, పెన్షన్ ను పెంచుకున్నామన్నారు.
రైతుబంధు మార్చి తర్వాత రూ.12 వేలు అవుతుందన్నారు. ఐదేళ్లలో రూ.16 వేలకు పోతుందన్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి భీమా చేయాలని నిర్ణయించామన్నారు. అర్హులైన మహిళకు నెలకు రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. చెప్పిన మాటలు ఇక్కడ వదలకుండా చర్చించి నిజాల వైపు నిల్చుని న్యాయం వైపు నిలవాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ దామోదర్ రావు, ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్ అభ్యర్థి బుక్యా జాన్సన్ నాయక్, బోధ్ అభ్యర్థి అనిల్ జాదవ్, మాజీ ఎంపీ వేణుగోపాలచారి, తదితరులు పొల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement