Wednesday, May 15, 2024

Adilabad | బ్రిడ్జి ప‌నుల‌కు ఫండ్స్ కావాలి.. సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రిక్వెస్ట్

ఖానాపూర్ (ప్రభు న్యూస్): హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్​ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యామ్ నాయక్ దంపతులు కలశారు. ఈ సంద‌ర్భంగా వారు నియోజకవర్గంలోని పలు సమస్యల గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని గంగపూర్ బ్రిడ్జి, పసుపుల బ్రిడ్జికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు.

అలాగే ఖానాపూర్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. వారి అభ్య‌ర్థ‌న‌కు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన‌ట్టు వారు తెలిపారు. అనంతరం కడెం ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిపై ఎమ్మెల్యే నుంచి సీఎం కేసీఆర్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement