Saturday, July 27, 2024

TS : మేడిగ‌డ్డ‌కు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం

మేడిగడ్డ బ్యారేజీను ప‌రిశీలించేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం చేరుకుంది. బ్యారేజీపై నుండి కుంగిన పిల్లర్లను అధికారుల బృందం పరిశీలిస్తున్నారు. గురువారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ బ్యారేజీ క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంది.

- Advertisement -

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగిన తర్వాత రెండోసారి విజిట్ చేస్తోంది ఎన్‌డీఎస్ఎ బృందం. మధ్యాహ్నం అన్నారం సరస్వతీ బ్యారేజ్ లను సందర్శించనున్నారు. ప్రాజెక్టు లోపాలు, పునరుద్దరణ అవకాశాలపై అధ్యయనం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి నిపుణుల బృందం ఇచ్చే సిఫారసులు కీలకం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement