Tuesday, May 14, 2024

ఎన్‌డీఏ కాదు ఎన్‌పీఏ, పనితనం లేని కేంద్ర ప్రభుత్వం.. ట్విట్టర్‌లో కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని ఎన్డీఏ అసమర్ధపాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దేశంలో45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం చేరుకుందని, 30 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం పెరిగిందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎల్పీజీ సిలిండర్‌ ధరలున్నాయని కేటీఆర్‌ విమర్శించారు. వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతున్నామని ఆర్‌బీఐ నివేదిక చెబుతోంది. ఇలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమని పిలవాలని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రతిభ చూపించని ప్రభుత్వంగా ఎన్డీఏ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement