Sunday, May 5, 2024

వైశాలి కిడ్నాప‌ర్ న‌వీన్ కు ఊర‌ట – పిడి యాక్ట్ ను కొట్టివేసిన హైకోర్టు

హైద‌రాబాద్ మన్నెగూడ వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డికి హైకోర్టులో ఊర‌ట ల‌భించింది..అత‌డిపై పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను కొట్టివేస్తూ సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కొన్ని నెల‌లు క్రితం మెడికో వైశాలిని తన స్నేహితులతో కలిసి నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత నవీన్ రెడ్డి అనుచరులు వైశాలి ఇంటిపై దాడి చేసి భీభ‌త్సం సృష్టించారు.

దీంతో అత‌డిని అరెస్ట్ చేసిన‌ రాచకొండ పోలీసులు ఇటీవల నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. దీనిని సవాల్ చేస్తూ నవీన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నవీన్ రెడ్డిపై విధించిన పీడీ యాక్ట్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ యాక్ట్ న‌వీన్ రెడ్డికి పేర్క‌న్న సెక్ష‌న్ల‌కు వ‌ర్తించ‌ద‌ని తీర్పు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement