Sunday, April 28, 2024

TS: ఖ‌మ్మం జిల్లా మిర్చి మార్కెట్ లో ప‌ర్య‌టించిన నామా నాగేశ్వ‌ర‌రావు

ఖ‌మ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి నామా నాగేశ్వ‌ర‌రావు ఖ‌మ్మం జిల్లా మిర్చి మార్కెట్ లో ప‌ర్య‌టించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మిర్చి మార్కెట్ లో ప‌ర్య‌టించారు. మిర్చి రైతుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. మిర్చికి ప్ర‌భుత్వం ఇస్తున్న ధ‌ర‌ల‌పై ఆయ‌న రైతుల‌తో చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా మిర్చి రైతులు మిర్చికి గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాల‌ని నామా నాగేశ్వ‌ర‌రావును కోరారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్య‌క్ర‌మంలో నామా నాగేశ్వ‌రరావు వెంట ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement