Sunday, May 5, 2024

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

యాదాద్రి : ప్రజావాణిలో ప్రజలు అందజేసే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుండి 70 ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదుల్లో రెవెన్యూ శాఖ 48, జిల్లా పంచాయతీ కార్యాలయం 12, పోలీసు శాఖ 2, భువనగిరి మున్సిపాలిటీ, మోత్కూర్ మున్సిపాలిటీ, ల్యాండ్ సర్వే శాఖ, సివిల్ సప్లై, యాదాద్రి దేవస్థానం, వైద్య శాఖ, ఎస్సీ కార్పొరేషన్, మత్స్యశాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 70 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ విజయ కుమారి, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వర చారి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement