Friday, May 3, 2024

NLG: రికార్డ్ స్థాయిలో కందులకు ధర… క్వింటాల్‌కు రూ.10,217…

తిరుమలగిరి, ఫిబ్రవరి 2(ప్రభ న్యూస్): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం నాడు తుంగతుర్తి మండల వెంపటి గ్రామానికి చెందిన గుగులోతు బద్రు రైతు 12 క్వింటాల కందులు తీసుకురాగా ప్రభుత్వ మద్దతు ధర 7000 ఉండగా కింట ధర రికార్డ్ స్థాయిలో 10,217 పలికిందని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ శుక్రవారం తెలిపారు. 321 క్వింటాలు 78 మంది రైతులు తీసుకురాగా గరిష్ట ధర 10 ,217 కనిష్ట ధర 80 89 మధ్య రకం ధర10,062 వచ్చిందని, ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధికంగా ధర రావడం ఇదే ప్రధమమని తెలిపారు. గుగులోతు బద్రి అధిక ధర రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement