Monday, April 29, 2024

AP: ఆత్మ‌కూరులో భువ‌నేశ్వ‌రి… బాధిత కుటుంబాల‌కు ప‌రామ‌ర్శ…

ఆత్మకూరు: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. దీనిలో భాగంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని అల్లిపురంలో నేడు ఆమె ప‌ర్య‌టించారు..

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక అల్లిపురంలో గుండెపోటుతో మృతిచెందిన తెదేపా కార్యకర్త కముజుల ఆంజనేయరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంత‌రం వెంకటగిరి నియోజకవర్గం, కలువాయి గ్రామంలో కార్యకర్త బొలిగర్ల చెన్నయ్య కుటుంబాన్ని కలుసుకున్నారు.. ఈ సంద‌ర్భంగా ఈ రెండు కుటుంబాల‌కు మూడు ల‌క్ష‌ల చొప్పున ఆర్దిక సాయం అంద‌జేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement