Saturday, May 11, 2024

గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌న్ : అస్వ‌స్థ‌త‌కు గురైన విద్యార్థులు

న‌ల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజ‌న్ కావడంతో విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఫుడ్ పాయిజన్ కావటంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు తెలిపారు. స్కూల్లో పెట్టే ఆహారం బాగోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట సరిగా చేయడంలేదని, తినలేకపోతున్నామని వాపోయారు. తరచూ వాంతులవుతున్నాయని తెలిపారు. వంట చేసే వ్యక్తి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు చెబుతున్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకుని తమను వేధించకుండా చూడాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement