Wednesday, May 1, 2024

కలెక్టర్ పమేలా పత్పతితో బ్రిటిన్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఒవెన్ యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తో భేటీ అయ్యారు. గురువారం జిల్లా సందర్శనలో భాగంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఛాంబర్ లో కలిశారు. జిల్లా కలెక్టర్ మర్యాద పూర్వకంగా శాలువా కప్పి మొక్క బహుకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును హైకమిషనర్ కు వివరించారు.

ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు, పలు దేశాలకు ఆదర్శంగా ఉందనిబ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఒవెన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ అడ్వైజర్ నళినీ రఘరామన్, ప్రోటోకాల్ ఆఫీసర్ ఖాజామైనుద్దీన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, యాదగిరిగుట్ట తహసిల్దార్, డీపీఎం తదితరులు ఉన్నారు. అంతకుముందు బ్రిటన్ హై కమిషనర్ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement