Saturday, September 21, 2024

తొలి రౌండ్ లో 4 వేలకు పైగా ఓట్ల మెజారిటీలో పల్లా..

ఖమ్మం-నల్ల‌గొండ‌-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ కొన‌సాగుతుంది. మొత్తం ఏడు రౌండ్లలో అధికారులు ఓట్ల లెక్కింపును చేప‌ట్టాల్సి ఉండ‌గా తొలిరౌండ్ ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ముందంజ‌లో దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్‌ మొదటి ప్రాధాన్యత ఔట్ల లెక్కింపు ముగిసే సమయానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఓట్లతో ముందజలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 16130 ఓట్లు రాగా, తీన్‌మార్‌ మల్లన్నకు 12046 ఓట్లు, ప్రొఫెసర్‌ కోదండరాంకు 9080 ఓట్లు వచ్చాయి. మూడుస్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేంధర్‌రెడ్డికి 6615 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 4354 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్‌లో 2789 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన సమీప ఇండిపెండెంట్‌ ప్రత్యర్థి మల్లన్న కన్నా 4084 ఓట్ల ముందంజలో ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement