Saturday, May 11, 2024

సమస్యల పరిష్కారమే ధ్యేయం: మున్సిపల్ చైర్మన్

కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని పలు కాలనీలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతిరోజు డ్రైనేజీ లను శుభ్ర పరచాలి అని సిబ్బందిని ఆదేశించారు. దోమలు ప్రబలకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతినిత్యం మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాలనీలో అభివృద్ధి పనులు సాగుతున్నాయని, సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement