Tuesday, May 14, 2024

కెసిఆర్ మూడో సారి సిఎం కావాలని కోరుతూ శ్రీశైలంలో ఎంపి ర‌విచంద్ర ప్ర‌త్యేక పూజ‌లు

శ్రీశైలం – తాను పోరాడి సాధించిన ప్రత్యేక రాష్ట్రాన్ని అన్ని విధాలా గొప్పగా అభివృద్ధి చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిపిన మహానేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని వేడుకున్నారు ఎంపీ రవిచంద్ర . బుధవారం తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ, వద్దిరాజు దేవేందర్-ఇందిరమ్మ, వద్దిరాజు వెంకటేశ్వర్లు-ఉమా మహేశ్వరి దంపతులు మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవీలకు గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు .

తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే యావత్ దేశం,ప్రజలు సుభిక్షంగా వర్థిల్లాలని, కేసీఆర్ మూడవ సారి తిరిగి ముఖ్యమంత్రి కావడమే కాక దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలని కోరుతూ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవీలను వేడుకున్నారు. ఎంపీ రవిచంద్ర,వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు వేద పండితులు ఆశీర్వచనాలు పలికి,తీర్థ ప్రసాదాలు అందజేశారు, శాలువాలతో సత్కరించారు.అలాగే,ఎంపీ వద్దిరాజు వెంట ఆయన సిబ్బంది మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అంత‌కుముందు ఆలయం వద్దకు చేరుకున్న వారికి వేద పండితులు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement