Thursday, May 2, 2024

సినీ కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చొర‌వ తీసుకోండి – మంత్రి త‌ల‌సాని

రాష్ట్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకునే వ‌ర‌కు వేచి చూడొద్ద‌ని సినీ కార్మికుల‌కు హిత‌వు ప‌లికారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.గ‌త కొన్నాళ్లుగా తమ వేతనాలు పెంచలేదని, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగడం తెలిసిందే. దాంతో నేడు సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. సినిమాల చిత్రీకరణలు లేకపోవడంతో ఉపాధి దొరక్క ఆర్థిక కష్టాల్లో ఉన్నారని వివరించారు. తక్షణమే సినీ కార్మిక సంఘాలతో ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని తలసాని సూచించారు. సమస్య రెండు మూడు రోజుల్లో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement