Saturday, May 4, 2024

Motkuru – 108 వాహనంలో ప్రసవం

మోత్కూర్, డిసెంబర్ 7 (ప్రభ న్యూస్) యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన పి.విజయలక్ష్మి అనే మహిళ నిండు గర్భిణీ కాన్పు కోసం స్ధానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా పురిటి నొప్పులు మొదలు కావడంతో 108 అంబులెన్స్ లో నల్లగొండ కేంద్రానికి వెళ్తుండగా మార్గ మధ్యలో నార్కట్ పల్లి చేరుకోగానే పురిటి నొప్పులు ఎక్కువగా కావడంతో స్థానిక ఆశ వర్కర్ బైరు అనిత సహకారంతో అంబులెన్స్ లోనే రెండో కాన్పు లో పండంటి మగ శిశువు (బాబు) కి జన్మనిచ్చింది.

.మెరుగైన వైద్య చికిత్స కోసం నల్లగొండ లోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆశావర్కర్ అనిత, ఈ.ఎం.టి.శశికిరణ్ ,పైలట్ లాధినేని సోమేశ్వర్ లు సేవలందించారు.తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు.సురక్షితంగా చికిత్స అందించిన 108 సిబ్బంది ,ఆశావర్కర్ లను విజయలక్ష్మి తల్లిదండ్రులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement