Wednesday, May 1, 2024

Breaking: తల్లి డెడ్​బాడీ పక్కనే మూడు రోజులుగా కొడుకు.. కుళ్లిన స్థితిలో మృతదేహం

హైదరాబాద్​లో ఘోరం జరిగింది. మతిస్థిమితం లేని ఓ 22 ఏళ్ల వ్యక్తి తల్లి మృతదేహం వద్ద మూడు రోజులుగా ఉంటున్నాడు. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్​ పరిధిలోని మల్కాజిగిరిలో జరిగింది. ఓ అపార్ట్​మెంట్​లో ఉంటున్న తల్లీకొడుకులు చాలా రోజులుగా బయటికి రావడం మానేశారు. అయితే ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు కంప్లెయింట్​ ఇచ్చారు. దీంతో ఈ విషయం కాస్త బయటికి వచ్చింది.

హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు తన తల్లి మృతదేహంతో అపార్ట్మెంట్‌లో మూడు రోజులు గడిపాడు. అయితే తల్లి మృతిలో ఆ వ్యక్తి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె పక్కనే మానసిక స్థితి సరిగా లేని ఆమె కుమారుడు సాయి కూడా ఉన్నాడు. మే 14వ తేదీ శనివారం ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు.

కాగా,  మృతురాలిని 50 ఏళ్ల విజయ వాణిగా గుర్తించారు. హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనర్ జోన్ పరిధిలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ భవనంలో ఆమె తన కుమారుడు వెంకట్ సాయితో కలిసి నివసిస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా,  కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.బీటెక్‌ చదివిన సాయి తల్లి మృతిలో హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు పోస్టుమార్టం నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement