Saturday, May 18, 2024

Modi : రేపు హైద‌రాబాద్ రానున్న‌మోడీ …

హైద‌రాబాద్ – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు మరోసారి రాష్ట్రానికి రానున్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాదిగ విశ్వరూప బహిరంగ సభ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇక, రేపు సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. 5 గంటల నుండి 5.40 వరకు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

అనంతరం 6 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, మాదిగ ఉప కులాల (మాదిగ విశ్వరూప బహిరంగ సభ) బహిరంగ సభలో ఎస్సీ కులాల వర్గీకరణపై మోడీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీలోని పలు వర్గాలు తెలిపాయి. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement