Tuesday, July 23, 2024

Delhi: మోడీ హ్యాట్రిక్ పీఎం కావడం ఒక చరిత్రే… ఈటల రాజేందర్

నరేంద్ర మోడీ ఒకే పార్టీ నుండి మూడోసారి ప్రధానమంత్రి కావటం అనేది ఒక చరిత్ర అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. 1962 తర్వాత మూడవసారి ఒకే పార్టీ నుండి ఒకే వ్యక్తి ప్రధాని కావడం చాలా అరుదైన విషయమన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా ను నేడు ఈటెల కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…. యావత్తు దేశ ప్రజలు తమ ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేశారని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ 2014లో, 2019లో చేసిన అభివృద్ధికి ప్రజలు ఎంతగానో సంతోషించి మూడవసారి కూడా అధికారం అప్పజెప్పారన్నారు.

దేశంలోనే పెద్ద నియోజక వర్గమైన మల్కాజ్ గిరి నుండి దాదాపు నాలుగు లక్షల మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రాష్ట్రంలో మంత్రిగా కొనసాగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి మోడీ నాయకత్వంలో లోక్‌సభలో ఎంపీగా కొనసాగడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. దేశంలోని పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈటల రాజేందర్ అన్నారు.

బండి, కిషన్ రెడ్డిలకు కూడా అభినందనలు…
తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఎంపికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను బీజేపీ కార్యవర్గ సభ్యులు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement