Friday, April 26, 2024

నేను బాగానే ఉన్నా: కరోనా పై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు క్లారిటీ

తనకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో అవాస్తవం అని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తనకు కరోనా సోకిందని పలు మీడియాలో వచ్చిన వార్తలు తప్పు అని తెలిపారు. తాను బాగానే ఉన్నానని, అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు. కోవిడ్ పై అందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్క్‌లు వినియోగం, రద్దీగా ఉండే ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించాలని తెలిపారు. ప్రతి ఒక్కరు కోవిడ్-19 నియమాలు పాటించాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement