Saturday, September 21, 2024

గ్రామాల అభివృద్దే ధ్యేయం: ఎమ్మెల్యే దాసరి

నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్నామని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా 10 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ ను ప్రారంభించారు. అనంతరం రూ.5 లక్షల రూపాయల గ్రామ పంచాయితీ నిధులతో అదనపు తరగతి గదుల  నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సర్పంచ్ లక్ష్మయ్య,ఎంపీటీసీ, ఉప సర్పంచ్ లక్ష్మయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement