Friday, May 17, 2024

రైతులను గోస పెడితే గుణపాఠం తప్పదు: ఎమ్మెల్యే దాసరి

రైతులను గోస పెడితే తగిన రీతిలో బుద్ధి చెబుతారని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నియోజకవర్గంలోని దేవునిపల్లిలో నల్ల జెండాలు ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ ఓకే దేశంలో వేరు వేరు విధంగా ధాన్యం కొనుగోలు చేయడం సిగ్గుచేటని, పంజాబ్ తరహా తెలంగాణ రైతన్నలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement