Sunday, May 19, 2024

ఈటల పతనం ప్రారంభమైంది: ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి

బీజేపీలో చేరిన వెంట‌నే ఈట‌ల ప‌త‌నం ప్రారంభ‌మైంద‌న్నారు ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి. హుజూరాబాద్  ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని ఈట‌ల ఢిల్లీలో తాక‌ట్టు పెట్టార‌ని, అటువంటి వ్య‌క్తి ఆత్మ‌గౌర‌వం గురించి మాట్లాడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. తెలంగాణకు బీజేపీ ద్రోహం చేయాలని చూస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. అటువంటి పార్టీలో చేరిన ఈటల హుజూరాబాద్‌లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పద‌ని ధ‌ర్మారెడ్డి అన్నారు. త‌మ‌ ప్ర‌భుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే త‌మ‌ను గెలిపిస్తాయ‌ని చెప్పారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన‌ని సంక్షేమ పథకాల‌ను కూడా త‌మ ప్ర‌భుత్వం అమలుచేస్తోంద‌ని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement