Thursday, May 16, 2024

NZB: వేణుగోపాల స్వామి ఆలయంలో మంత్రి వేముల ప్రత్యేక పూజలు

శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని వేణుగోపాల స్వామి ఆలయంలో మంత్రి వేముల దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి (గోకుళాష్టమి)ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రీ కృష్ణ భగవానుడి కృపతో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి వేముల కాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement