Wednesday, May 1, 2024

Nitya Krushivaludu KTR: మంత్రి కేటీఆర్ పై పుస్తకం..

నేటి యువతకు మంత్రి కేటీఆర్ నడవడిక ఆదర్శమన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేటీఆర్ అంటే యూత్ ఐకాన్ అని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర సెక్రటరీ జి.రాజేష్ నాయక్ రచించిన ‘నిత్య కృషీ వలుడు కె.టి.ఆర్’ పుస్తకాన్ని మంత్రి వేముల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించడంలో కేటీఆర్ ది ముఖ్య పాత్ర అని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కొత్త పరిశ్రమలు, ఐ.టి కంపెనీలను రప్పించి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. టి-హబ్ లాంటి వేదికలతో యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల్లో అభిమానం చురగొన్న యువ నాయకుడు కేటీఆర్ అని మంత్రి వేముల కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement