Sunday, April 28, 2024

శుభకృత్ లో అంతా శుభమే: మంత్రి పువ్వాడ

తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని, ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తినిచ్చిందన్నారు.

ఈ ఏడు కాలంతో ప్రమేయం లేకుండా జలాలతో కాలువలు, చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా నిండి ఉన్నాయని రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లాలన్నారు. గత రెండు సంవత్సరాలు కరోనాతో పండగను వేడుకగా జరుపుకోలేక పోయామని, ఈ శుభకృత్ సంవత్సరంలో అన్ని పాలద్రోలి అన్నింటా అందరికి శుభం జరగాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. ఈ కొత్త సంవత్సర పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement