Monday, May 6, 2024

ధాన్యం కొనుగోలు చేయకుంటే సంగతి చూస్తా: కేంద్రానికి మంత్రి పువ్వాడ హెచ్చరిక

తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన దీక్ష చేపట్టాలని టిఆర్ఎస్ పార్టీ అధినేత  సీఎం కేసీఅర్ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ఉన్న ధర్నా చౌక్ లో నిర్వహించిన మహాధర్నా, రైతుదీక్ష విజయవంతమైంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుంటే సంగతి చూస్తామని హెచ్చరించారు. తెలంగాణ రైతులు పండించిన వడ్ల కొనుగోలుపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, రైతాంగం పండించిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement