Wednesday, May 1, 2024

Khammam: ఖమ్మంలో మంత్రి పొంగులేటి ఆకస్మిక పర్యటన… ప్రజలతో మమేకం…

ఖమ్మం సిటీ : రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో ఆకస్మికంగా పర్యటించారు. నగరంలోని 59వ డివిజన్ దానవాయిగూడెం, 60వ డివిజన్ రామన్నపేటలో ఆకస్మికంగా పర్యటించి పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. బుధవారం ఉదయం ద్విచక్రవాహనంపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి స్థానిక స్థితిగతులు పరిశీలించారు. వీధుల్లో తిరుగుతూ ప్రజలను అడిగి స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు.

వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా తరచూ ఆకస్మిక పర్యటనలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు. అధికారులందరూ ఎప్పటికప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలను అందించే బాధ్యత అధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు సైతం తన దృష్టికి వచ్చాయని, ఆ సమస్యలను కూడా త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement