Sunday, April 28, 2024

హైదరాబాద్ ట్రాఫిక్ స‌మ‌స్యకు లింక్ రోడ్లతో చెక్!

హైదరాబాద్ న‌గ‌ర అభివృద్ధికి ర‌హ‌దారులు చాలా ముఖ్యమ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం నగరంలో ఐదు లింకు రోడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే 16 లింకు రోడ్ల‌ను పూర్తి చేశామ‌ని,  వీటితో హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ స‌మ‌స్య త‌గ్గుతుందని కేటీఆర్ చెప్పారు. త్వ‌ర‌లోనే మ‌రో 6 రోడ్ల‌ను పూర్తి చేస్తామ‌ని అన్నారు. హైద‌రాబాద్ లో పెరుగుతున్న జ‌నాభా, జ‌న సాంద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ర‌హ‌దారుల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. ఎస్ఆర్డీపీలో భాగంగా ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. రూ. 6 వేల కోట్ల‌తో ఎస్ఆర్డీపీ ప‌నులు కొన‌సాగుతున్నాయని వెల్లడించారు.

సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో స‌ర్వ‌తోముఖాభివృద్ధి సాధిస్తోంద‌ని తెలిపారు. మౌలిక వ‌స‌తుల విస్త‌ర‌ణ‌లో అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. హైద‌రాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. హైద‌రాబాద్ రోడ్డు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ కింద అద‌నంగా మొద‌టి ద‌శ‌లో రూ. 313.65 కోట్ల‌తో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామ‌ని చెప్పారు. ద‌శ‌లవారీగా మొత్తం 133 లింకు రోడ్లు నిర్మిస్తున్నామ‌ని వివ‌రించారు. రెండో ద‌శ‌లో రూ. 65 కోట్ల‌తో నాలుగు రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి అద‌నంగా రూ. 230 కోట్ల‌తో మ‌రో 13 రోడ్ల‌ను అభివృద్ధి చేస్తామ‌ని పేర్కొన్నారు. లింక్ రోడ్ల వల్ల ప్రధాన రహదారులపై భారం తగ్గుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement